Posts

Showing posts from July, 2021

Telugu story

 తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.         మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు అయింది.కొడుకు....కూతురు అమెరికాలో స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు  వచ్చేయమంటారు.కానీ నాకే ఇషష్టం లేదు  ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో కాలం గడుపుతున్నాను.      కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!        చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్ చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది. అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.         నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.     ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని  గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు...

Telugu story

 #కాశీలో  జరిగిన ఒక #యదార్ధ_సంఘటన     ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది.ఆ ఇంట్లోవారందరూ ధార్మికులు,దైవ భక్తి కలవారు.ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు.వయస్సులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు.తనకి ఆటలయందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు.ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు,అక్కడ ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడం విన్నాడు.ఆ పసితనం లోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనస్సులో దృడంగా నాటుకుంది.ఎలా వెళ్ళాలో తెలియదు.అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు.తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు.ఇలా ఉండగా ఒక రోజు పెద్ద వర్షం పడుతుండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కాలగతి చెందారు.అప్పుడు తను ఇంట్లో లేకపోవడం వలన తానొక్కడే బ్రతికాడు.ఇక ఒక్కడే అనాధలా మిగిలిపోయాడు.ఆ చిన్నవాడు రోజూ తన వాళ్ళను తలచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు.ఆ పిల్లాడ్ని చూసి ఆ ఊరివారంతా బాధ పడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు. అప్పుడు అతని ఊరికి ఆ సాధువు మళ్ళీ వచ్చాడు .....  ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి  "ఎందుకు అనవసరంగా బాధ...

Telugu story

 *#డిగ్నిటీ ఆఫ్ లేబర్* సికిద్రాబాద్ to ఖమ్మం ట్రైన్ లో వస్తున్నా. నాముందు ఓ  కుర్రాడు ఖాళీ గంపతో కొంచెం అలసటతో కనిపించాడు.. “నేను... *ఏరా తమ్ముడూ!!* సమోసాలు మెుత్తం అమ్మేసావా....”?? “అవును సార్!” “పాపం రోజంతా కష్టపడుతున్నావ్? “అవును సార్!!  ఏంచేస్తాం.. పొట్ట కూటి కోసం తప్పదు కదా!!” ఒక సమోసా అమ్మితే ఎంత వస్తుంది...రా..??? “రూపాయి వస్తుంది సార్!!” “రోజుకు ఎన్ని సమోసాలు అమ్ముతావు??” “మంచి గిరాకీ ఉన్నప్పుడు దాదాపు *3,000 – 3,500* అమ్ముతాను.. ఇగ తక్కువలో తక్కువ 2000 సమోసాలు ఒక రోజుకు...గ్యారెంటిగ అమ్మే పోతా ఇంటికి నా మెదడు ఒక్కసారిగా లెక్కలు వేయడం మొదలెట్టింది… రోజుకు 2,000 సమోసాలంటే వీడికి 2000రూ.. *నెలకు ₹ 60,000/- రూ. ఓరి దేవుడో.. నా నెల జీతం 15,000రూ మాత్రమే..* వీడు నాకంటే బెటర్ గా ఉన్నాడనుకున్నా… “తమ్ముడు మీరే తయారు చేస్తారా వీటిని” “లేదన్నా మా యజమాని తయారుచేస్తారు...!! “ఇవి కాకుండా ఏం చేస్తావు!!” “వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అన్నా..ఇంక సీజనల్ బిజినెస్ లు చేస్తా .... పోయిన సంవత్సరం ఎకరం పొలం కొన్నాను… నా అక్క పెళ్ళి చేసాను… ” ఆ పొలం విలువ ఇప్పుడు పది లక్షలుంటది…???...

Telugu story

 నారింజ పండ్లు 🌱ఒకసారి చైనా చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలకు కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లనీ వాటిని తిన్నవాళ్లు మృత్యుంజయులవుతారని వాటిని తీసుకొచ్చిన చైనా రాజ ప్రతినిధి దేవరాయులకు విన్నవించాడు.  🌱పళ్లెంలో నిగనిగలాడుతున్న ఆ నారింజ పండ్లను దేవరాయలతో పాటు సభలోని వాళ్లందరూ కుతూహలంతో చూస్తూ ఉండగా రామలింగడు లేచి టక్కున ఆ నారింజ పండును వొలిచి నోట్లో వేసుకుని భలే రుచిగా ఉంది అన్నాడు.  🌱అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు.  🌱ఈ చర్యకు శ్రీ కృష్ణ దేవరాయలకు చెప్పనలవి కాని కోపమొచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పండ్లు. నా అనుమతి లేకుండా తీసుకున్నావ్... నీకు మరణశిక్ష తప్పదు అన్నారు.  🌱ఆ మాటలు విన్న తెనాలి రామలింగడు పకపకా నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరీ కోపం ఎక్కువై ఎందుకు నవ్వుతున్నావని? అడిగారు.  🌱నవ్వక ఏం చేయమంటారు? ప్రభూ.. ఏ పండ్లు తింటే మృత్యుంజయులవుతారని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండన విధించారు. మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా? అన్నాడు రామలింగడు నవ్వుతూ.... 🌱ఈ మాటలతో రాయలకు నవ్వుమొలకెత్తడంతో ఆయనతో పాటు స...

Telugu story

 నందవరంలో నివసించే చంద్రయ్య దగ్గర ఒక అందమైన గుర్రం ఉంది. దాని కాళ్లకు గజ్జెలు కట్టి నాట్యం చేయడం నేర్పాడు. అవి ఘల్లుఘల్లుమని శబ్దం చేస్తుంటే భలే ఉండేది. పెళ్లిళ్లు, జాతర్లలో గజ్జెలగుర్రంతో నాట్యం చేయించడానికి చంద్రయ్యను పిలిచేవారు. అందుకుగాను డబ్బులు ఇచ్చేవారు. అతనికి చందు అనే కొడుకు ఉన్నాడు. అప్పుడప్పుడు సెలవుదినాల్లో చందూను వెంటతీసుకెళ్లేవాడు చంద్రయ్య. గజ్జెలగుర్రం నాట్యం చూసి ఆనందించే వాడు. ఒక రోజు ఒక పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చే వేళకు సాయంత్రమైంది. గుర్రాన్ని కట్టేసి తండ్రీకొడుకులు అలసటతో మంచంపై వాలిపోయారు. వెంటనే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత ఇంటి బయట నుంచి ఎవరో గట్టిగా పిలుస్తుండడంతో లేచి వచ్చారు. ఇంటి ముందు బారెడుగెడ్డం, మూరెడు మీసం ఉన్న ఒక పొట్టి మనిషి ఉన్నాడు. అతను చంద్రయ్యతో ‘అయ్యా! నా పేరు జడలయ్య. మా ఇంట్లో తాతలకాలం నాటి నాలుగు గజ్జెలు ఒక రాగిచెంబులో ఉన్నాయి. ఏ ఉపయోగం లేని వీటిని తరతరాలుగా ఇంట్లో ఖాళీగా ఉంచుకోవడం ఎందుకు.. అందుకే అమ్మెద్దామనుకుంటున్నాను’ అని చెప్పి, గజ్జెలను తీసి చేతికిచ్చాడు. చంద్రయ్య వాటిని అటూఇటూ కదిలించాడు. అవి శ్రావ్యంగా, ఎంతో మధురమైన శబ్దంతో ...

Telugu story

 అమెరికా పోలీసులు ఒక 15 ఏళ్ళ కుర్రాడిని అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు  జడ్జి విషయమేంటని అడిగితే  ఈ అబ్బాయి ఒక బేకరీ లో బ్రెడ్ దొంగతనం చేసి పారిపోతుండగా అక్కడ వాచ్మాన్ పట్టుకున్నాడని అప్పుడు పెద్ద అద్దం పగిలిపోయిందని అందుకుగాను ఆ యజమాని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు  జడ్జి: దొంగతనం చేసావా  పిల్లాడు : అవును మేడం  జడ్జి :ఏమీ దొంగతనం చేసావు  పిల్లాడు: ఒక బ్రెడ్ ప్యాకెట్  జడ్జి: డబ్బులిచ్చి తీసుకుని ఉండొచ్చుగా  పిల్లాడు :డబ్బులు లేక తీసుకున్నాను మేడం  జడ్జి :ఇంట్లో వారిని అడిగి ఉండొచ్చుకదా  పిల్లాడు :అమ్మ మాత్రమే ఉన్నారు అందులోనూ                        అనారోగ్యం అన్నాడు  జడ్జి :ఏదైనా పని చేయొచ్చుగా నువ్వు  పిల్లాడు :ఒక కారు షెడ్ లో పనిచేస్తుండేవాడిని                        మేడం అమ్మకు అనారోగ్యమని ఒక్కరోజు                సెలవు పెట్టినందుకు పని నుండి తీసేసారు...
 నాటి పాతాళ లోకమే నేటి అమెరికా! ➖➖➖➖➖➖➖➖ పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ గారు మొదలైన అనేక మంది పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతల వైపున అమెరికా ఖండం ఉంది. భారత దేశంలో నిల్చున్నవారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిం చారు. 👉 సగర చక్రవర్తి పుత్రులు 60,000 మంది అశ్వమేధ యాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిల మహర్షిని చూసి, ఆయనే దొంగిలించాడని ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు. 👉 ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న ఆ ప్రదేశం ఆయన పేరున కపిలారణ్యంగా ప్రసిద్ధికెక్కిందని, అదే ఈనాటి కాలిఫోర్నియా (శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖ రేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉప న్యాసంలో చెప్పారు.) 👉 కాలిఫోర్నియకు దగ్గరలో ఉన్న ఆష్‌ల్యాండ్ (Ashland)  (సగర పుత్రులు బూడిద కుప్పలు గా  మారిన ప్రదేశం) మరియు  👉 హార్స్‌ల్యాండ్ (Horse land) (యాగాశ్వం కట్టిన ప్రదేశం) అనే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నదం (Gangotri Glaci...

Telugu story

 రంగడికి పొద్దున్నే కలొచ్చింది.. పదేళ్ల క్రితం పోయిన వాళ్లమ్మ..లీలగా..  ఏదో కావాలని అడిగింది... ఇంతలో మెలకువ... గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాడు.. కలలో ఏం జరిగిందని..  అమ్మ ఏదో చెబుతోంది..   గుర్తుకి రావట్లేదు.. తన భార్య రమ్యతో చెప్పాడు..   తన అన్నకి చెప్పాలనుకున్నాడు.. అమ్మ కలలో వచ్చిందని. రెండేళ్లుగా రెండు కుటుంబాలకీ మధ్య మాటలు లేవు.. అన్నావదినలతోనే పెరిగాడు.  తనకి పెళ్లైన తరువాత కూడా.. రమ్య అందరితో కలిసిపోయింది. కాని,  ఎందుకో..చిన్న చిన్న విభేధాల వల్ల.....రెండు కుంటుంబాల మధ్య దూరం పెరిగింది.. బాగా పెరిగింది. వారం రోజులు గడిచింది.  అమ్మ మళ్లీ కలలోకొస్తే బావున్ను...ఏంబుతోందో  తెలుసుకోవాలనుకుంటున్నాడు.. కాని అమ్మ రావట్లేదు కలలోకి. అమ్మ ఫొటో దగ్గరకి వెళ్లాడు..  అమ్మని తదేకంగా చూసాడు. 'అమ్మా మళ్లీ కనిపించమ్మా.. మాట్లాడలనుంది'.. నెల గడిచింది.   అమ్మ కలలోకి రాలేదు.  ఊహించుకున్నాడు.. కలలో వస్తుందని.. తెలుసు ఊహలు మనం ఎలాగైనా ఊహించేవి.  కలలు వాటంతట అవి వచ్చేవి.  అమ్మ కలలో వస్తే బావున్ను. ఆర్నెళ్లు గడిచాయి.. ...

Akbar birbal story in Telugu

 చిలుక పలుకులు: . అక్బర్ చక్రవర్తికి వేటాడ్డం ఒక సరదా. ఆ సరదా వల్ల రాజ్యంలోని అడవులన్నీ నిర్వీర్యమైపోవడం బీర్బల్‌ను ఎంతగానో బాధించింది. బీర్బల్ ఈ విషయాన్ని అక్బర్‌ దృష్టికి తీసుకురావాలనుకున్నాడు. తగిన సమయం కోసం ఎదురుచూస్తుండగా ఒకరోజు అక్బర్‌ తన పరివారంతో కలిసి వేటకు వెళ్ళాడు. బీర్బల్‌ కూడా అతని వెంటే ఉన్నాడు. అడవికి వెళ్ళే తోవలో వారు ఒక చిలుకల గుంపు చెట్టుపై కూర్చుని అరవడం చూశారు. అక్బర్‌ బీర్బల్‌తో "బీర్బల్‌! నువ్వు పక్షుల భాషను అర్ధం చేసుకుంటానని చెప్పావుగా, ఆ చిలుకలు ఏమని మాట్లాడుకుంటున్నాయో చెప్పగలవా?" అని అడిగాడు. బీర్బల్‌ వాటి మాటలను శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ, "రాజా! ఈ చిలుకలు పెళ్ళి పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాయి. పిల్ల వాడి తండ్రి  ఏ పక్షులూ, జంతువులూ లేని ఐదు అడవులను వరకట్నంగా కావాలని అడుగుతున్నాడు. పెళ్లికూతురు తండ్రి ఇదేం కర్మ, పది ఖాళీ అడవులైనా కట్నంగా ఇవ్వడం సమ్మతమే అంటున్నాడు" అని చెప్పాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాయో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్బర్‌, "మరి పెళ్లికొడుకు తండ్రి ఏమంటున్నాడు?" అని అడిగాడు. బదులుగా బీర్బల్‌ "మహారాజా! పె...

Telugu story

 ఒక ఊరిలో ఒక కమ్మరి ఉండేవాడు. అతను ఒకసారి, ఒకే కొలిమిలో రెండు మంచి నాగళ్లను తయారుచేశాడు. ఒకనాడు ఒక రైతు, నాగలి కావాలంటూ కమ్మరి దగ్గరికి వచ్చాడు. కమ్మరి తన దగ్గరున్న రెండు నాగళ్ళనూ రైతుకు చూపించాడు. అంతలోనే ఒక నాగలి మాట్లాడింది ఉత్సాహంగా: "నన్ను తీసుకెళ్ళు ఓ రైతూ! నేను నీకు పొలం దున్ని మంచి పంట పండిస్తాను" అని. రెండో నాగలి ఇష్టం లేనట్లు ముఖం పక్కలు తిప్పుకుని పడుకున్నది. సహజంగానే ఆ రైతు మొదటి నాగలిని కొనుక్కున్నాడు. రెండవ నాగలి కమ్మరి దగ్గరే మిగిలిపోయింది. కొంత కాలం గడిచింది. కమ్మరి నాగలి అక్కడే పడిఉంది. దాన్ని వేరే ఎవ్వరూ తీసుకుపోలేదు. మెల్లగా దానికి తుప్పు పట్టింది. ఒకసారి రైతు ఏదో పనిపడి, తన నాగలిని తీసుకుని కమ్మరి దగ్గరికి వచ్చాడు. కమ్మరి నాగలి, రైతు నాగలిని చూడగానే గుర్తుపట్టింది- అది ఇంకా కొత్తదానిలాగే మెరిసిపోతున్నది! "నేను తుప్పు పట్టిపోయాను.నువ్వేమో నిగనిగలాడుతున్నావు. కారణం ఏమిటి?" అడిగింది కమ్మరి నాగలి. "నేను ఎప్పుడూ పని చేస్తూ ఉంటాను. అందుకనే మెరుస్తున్నాను. నువ్వు ఏ పనీ చెయ్యకుండా పడి ఉన్నావు. అందుకే తుప్పు పట్టి, ఇలా దుమ్ము కొట్టుకుపోయావు" అని...

Akbar birbal story in Telugu

 #దురదగుంటాకు.....!!                                          ఒక రోజు అక్బర్, బీర్బల్ ఇద్దరూ వ్యాహ్యాళికి వెళ్లారు.                దారిలో తులసి చెట్టు కనిపించేసరికి బీర్బల్ వంగి సంస్కారంతో ప్రణామం చేసాడు.                                   ఎవరది ఏంటది అనడిగాడు అక్బర్....!. దానికి బీర్బల్ - "మాతల్లి తులసీమాత రాజా..." అని వినయంగా చెప్పడం జరిగింది.                 అక్బర్ వెంటనే అది పీకి పారేసి "ఎంతమంది తల్లులు ఉంటారు మీ హిందువులకు" అంటూ ఎగతాలిగా అన్నాడు.                  అది విని ఎలాగైన అక్బర్ కి బుద్ధి చెప్పాలని సరైన అవకాశం కోసం ఎదరుస్తూ చూస్తూ బీర్బల్ ఓపిగ్గా అక్బర్ వెంట నడుస్తున్నాడు.                ఓ చోట #దురదగుంటాకు చెట్టు...

Historical story

 #రాణి_అబ్బక్క_చౌతా!! సంవత్సరం 1555. పోర్చుగీస్ వలసరాజ్యాల శక్తి 1500 లలో గరిష్ట స్థాయిలో ఉంది.వారు #కాలికట్ యొక్క జామోరిన్స్ను నాశనం చేశారు బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించాడు గుజరాత్ సుల్తాన్ నుండి డామన్ ను తీసుకొని, మైలాపూర్ లో ఒక కాలనీని స్థాపించారు, బొంబాయిని స్వాధీనం చేసుకున్నారు మరియు గోవాను వారి ప్రధాన కార్యాలయంగా మార్చారు.వారు దాని వద్ద ఉన్నప్పుడు దానిపై చర్చిని నిర్మించడానికి పురాతన #కపలీశ్వర ఆలయాన్ని కూడా నాశనం చేశారు. వారి తదుపరి లక్ష్యం,#మంగుళూరు యొక్క #లాభదాయక_ఓడరేవు. వారి దురదృష్టం, మంగుళూరుకు దక్షిణాన కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉల్లాల్ యొక్క చిన్న స్థావరం అప్పుడు 30 ఏళ్ల రాణి చేత పాలించబడింది - * #రాణి_అబ్బాక్కా_చౌతా * ప్రారంభంలో, వారు ఆమెను తేలికగా తీసుకొన్నారు ఆమెను పట్టుకుని తిరిగి గోవాకు తీసుకురావడానికి కొన్ని పడవలు మరియు సైనికులను పంపారు - ఆ పడవలు తిరిగి మళ్లీ రాలేదు. ఆశ్చర్యం తో మరియు కోపంతో, వారు ఈసారి భారీ నౌకలను పంపారు, చాలా ప్రసిద్ధ అడ్మిరల్ డోమ్ అల్వారో డా సిల్వీరా నాయకత్వంలో - అడ్మిరల్ తీవ్ర గాయాలతో కాళీ చేతులతో తిరిగి వచ్చాడు. ఆ తరువాత, మరొక పోర్చుగీస్ న...

Telugu story

అనగా అనగా ఒక పెద్ద అడవి వుంది. అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్యా పిల్లలతో కలిసి వుంది. ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది. అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి. రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి. అలా రోజులు గడుస్తున్నాయి. వానాకాలం మొదలయింది. ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి. ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి. ఆ అడవి సగం నీటితో నిండిపోయింది. అందులో తోడేలు గుహ కూడా వుంది. దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయింది. వాటికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహ కోసం వెతకటం మొదలు పెట్టినాయి. తోడేలు తన భార్యతో "మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి. ఆహారము లేదు సరికదా! మన పిల్లలు వానకు తడిసి పోతున్నారు. ఇపుడేమి చేద్దాం?" అని అంది. ఆడ తోడేలు చాలా తెలివిగలది. అది బాగా ఆలోచించింది. అచటకు దగ్గరలో ఒక గుహ వుంది. దానిలో ఒక సింహం వుంది. అది విశాలమైన గుహ. బాగా ఆలోచించగా ఈ విషయం ఆడ తోడేలుకు గుర్తుకు వచ్చింది. దానిలో ఎంత కాలమైనా హాయిగా వుండవచ్చు అనుకుంది. ఈ ఆలోచన మోగుడికి చెప్పింది. అది విని తోడేలు మండిపడింది. ...

Telugu story

 అవంతీ నగరంలో ఒక వేదపండితుడు ఉండేవాడు. ఇతనంటే ఊరందరికీ బాగా నమ్మకం. చివరికి రాజుగారికి కూడా నమ్మకం. ఎక్కడ ఏ కార్యం చేయలుకున్నా ఇతడి చేత చేయించేవారు..  ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం వలన యజ్ఞాలు చేశాడు. యాగాలు చేశాడు. చివరికి పుత్రకామేష్టి యాగం చేయగా ఒక పుత్రుడు జన్మించాడు. ఎంతో సంతోషంతో జతకాది కర్మలు చేశాడు.  ఒకరోజు ఈ పిల్లాడి జాతకచక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది.. గుండేఝల్లుమంది. అయినా మళ్ళి మళ్ళి వేశాడు. ఎన్నిసార్లు చుసినా గజదొంగ అవుతాడు అని వచ్చింది. అప్పుడు ''బాబోయ్! నేను పండితుడిని. వీడు గజదొంగ. పండితపుత్రుడు పరమ శుంఠ'' అనేమాట నిజమౌతుందేమో!''అని భయపడ్డాడు. ఇంతలోనే మనస్సుని అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కాని మనస్సుని అదుపు చేయాలి. ఎలా? ఎలా? ఎలా? అని అలోచించి ఆరోజు నుండి పిల్లాడికి రామాయణ భారత, భాగవతాలు, గరుడపురాణం లాంటి పురాణాలు బాగా పిల్లాడికి చెప్పాడు. వీటిలో ప్రత్యేకంగా గరుడపురాణం మరీమరీ ఒకటికి పదిసార్లు వినిపించాడు. దాంతో పిల్లాడి హృదయంలో జ్ఞాన సంపద వెలిగింది.. ఈ తప్పు చేస్తే ఈశిక్ష పడుతుంది. ఆ తప్పుచేస్తే ...

Telugu story

 *స్పందించే తీరు* ఒకసారి సుందర్ పిచాయ్  (గూగుల్ CEO) స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు మహిళలు కూడా కూర్చున్నారు.  ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక  ఆ ఇద్దరు మహిళల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి.. ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో మహిళ మీద పడింది. ఆవిడ కూడా అదే స్థాయిలో గగ్గోలు పెట్టింది. ఆ గందరగోళం లోనే దాన్ని విదిల్చేసరికి అది వెళ్ళి ఒక సర్వర్ మీద పడింది. అతను చాలా ప్రశాంతంగా ఆ బొద్దింకను పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు విసిరేశాడు. ఈ సంఘటన విన్నాక మీకేమనిపించింది? ఒక పది సెకన్లు ఆలోచించి మీకు ఏదో ఒకటి అనిపించాక ఇది చదవండి! మీలాగే ఈ దృశ్యాన్ని చూసిన సుందర్ పిచాయ్ కు కూడా కొన్ని ఆలోచనలు వచ్చాయి.  మనకొచ్చిన ఆలోచనలకు, అతని ఆలోచనలకు తేడా ఏమిటో అతని మాటల్లోనే తెలుసుకుందాం! కాఫీ తాగుతూ జరిగిందంతా చూసిన నాలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ గందరగోళం అంతటికీ కారణం ఏమిటి? ఆ మహిళలు అంత హిస్టీరిక్ గా మారిపోడానికి కారణం ఏమిటి? బొద్దింకా? అలా అయితే ఆ సర్వర్ మీ...

Telugu story

 ఒక వృద్ధురాలైన మహిళ తన బ్యాంకు ఖాతా లో నుండి కొంత డబ్బు డ్రా చేసుకోవాలని బ్యాంకుకు వెళ్ళింది. అక్కడ ఉన్నబ్యాంకు క్యాషియర్ కి బ్యాంక్ కార్డును అందజేసి ఆమెతో “నేను రూ .500 ఉపసంహరించుకోవాలనుకుంటున్నాను ..” అని అన్నారు. ఆ మహిళా క్యాషియర్ ఆమెతో, “రూ.5,000 కన్నా తక్కువ డబ్బు డ్రా చేయడం కోసం కనుక అయితే, దయచేసి ఎటిఎం ఉపయోగించండి” అని అంది.  ఆ వృద్ధురాలు “ఎందుకు?” అని అడిగింది. వెంటనే ఆ క్యాషియర్ చిరాగ్గా, “ఇవి బ్యాంకు నియమాలు. వేరే విషయం లేకపోతే దయచేసి వెళ్ళండి . మీ వెనుక క్యూ ఉంది. అంటూ కార్డును వృద్ధురాలికి తిరిగి ఇచ్చేసింది. వృద్ధురాలు రెండు నిముషాలు మౌనంగా ఉండిపోయింది. కానీ, వెంటనే ఆమె కార్డు క్యాషియర్ కి తిరిగి ఇచ్చి, “దయచేసి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఉపసంహరించుకోవడంలో నాకు సహాయపడగలరా” అని అడిగింది. క్యాషియర్ వృద్దురాలి ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేసి చూసి చాలా ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె (ఆ క్యాషియర్) చాలా వినయంగా, వృద్ధురాలితో, “నన్ను క్షమించండి మామ్మ గారు, మీ ఖాతాలో 350 కోట్లు రూపాయలు ఉన్నాయి మరియు మా బ్యాంకులో ప్రస్తుతం అంత నగదు లేదు. మీరు అపాయింట్మెంట్ ఇచ్చి రేపు మళ్ళీ రాగల...

Telugu story

 చాణుక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన అద్భుతమైన నీతి కధ..   ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.....అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి . ఉరుములు , పిడుగులు . పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...!  భగవాన్ ! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి ?.  ఏమి జరగబోతోంది ?  లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? బిడ్డ బతుకుతుందా?  సింహం లేడిని తినేస్తుందా ?   వేటగాడు లేడిని చంపెస్తాడా ?  నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?  ఒక వైపు నిప్పు ,  రెండో వైపు నది , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం. కానీ లేడి మాత్రం...

Telugu story

 సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?" డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను. మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"... తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే.. నువ్వు శాంతంగా ఉండగలవా?" డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "మన పవిత్ర వేద గ్రంధాలలో ఉన్నది ఒకటి చెప్పనా.. 'మనం మట్టి నుండే వచ్చాం. మట్టిలోకే వెళ్ళిపోతాం. అదంతా ఆ భగవంతుని మాయాలీలలు. డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవిత కాలాన్ని పొడిగించలేరు. మీరు వెళ్లి మీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి. నేను చెయ్యవలసింది చేయటానికి ప్రయత్నిస్తాను. తండ్రి కోపంతో రగిలిపోతూ ...

Telugu story

వీలుంటే మొత్తం  చదవండి.. *తెలివైన పిల్లలు_ కథ.* కొన్ని నెలల క్రితం,  కొత్తగా  ఒక పనిమనిషి చేరింది,  నాకు పనిమనిషి  అన్న పదం పలకడం  ఇష్టం ఉండదు,  మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా,  ఇక ఈ వ్యాసంలో  ఈ పదాన్ని ఉపయోగించను.  ఆవిడ పేరు శివమ్మ.  మూడు నాలుగు రోజుల తరువాత అడిగా..  అమ్మా! ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు? అని. ముగ్గురు అమ్మాయిలు అని చెప్పింది.  పెళ్లిళ్లు అయ్యాయా? అని అడిగాను. లేదండీ! ఇంకా చదువుకుంటున్నారు"  అని చెప్పింది. OK,  ఏం చదువు కుంటున్నారు?  అని క్యాజువల్ గా అడిగా. పెద్ద అమ్మాయి  MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి  డిగ్రీ కాలేజ్ లో  కాంట్రాక్ట్  లెక్చరర్ గా  చేస్తోంది అన్నది.  ఆ అంటూ నోరు తెరిచా. రెండో అమ్మాయి  MSC computers మొదటి సంవత్సరం,  మూడో అమ్మాయి ఎంబీబీస్  రెండో సంవత్సరం  అని చెప్పింది. మరోసారి నోరు వెళ్ల బెట్టా. నర్సింగా? అన్నా. కాదు సార్ MBBS అంది.  నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది,  ఏం మాట్లాడుతోంది. ఈవిడకు  ఏం మాట్లాడ...

Telugu story

 *💥మానవత్వం 💎*  *ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి* *అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు...*   *చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు...*   *మూడుసార్లు* *లెక్కపెట్టాడు..తప్పు* *ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..*   *ఆ డబ్బులు తీసుకుని* *నెమ్మదిగా తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..*   *షాప్ లో ఆవిడ తనవేపు* *చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...*   *షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది..*   *ఏమి కావాలి బాబు అని..బాబు చెప్పాడు..*   *నాకు ఒక #అద్భుతం కావాలి అని..*   *షాప్ ఆవిడ అర్ధం కానట్టూ ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది..*   *నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని..చెల్లి చాలా కష్టపడుతోంది..అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది..అని* *అడిగాడు బాబు...*   *ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..*...

Maha Bharatham lo Kadha

 మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు. ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు. దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ... "ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతా...

Maha Bharatham lo Oka kadha

పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని  పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు  అహంకారంగా  మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం  కృష్ణుడు ధర్మరాజుని వేరే  రాజ్యానికి తీసుకు వెళ్ళాడు. ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.  అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు... ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది ! ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా   బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా ?.. అని చెప్పడంతో... ఆమె... మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును  మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది !!! ఆ రాజ్యపు సంపదను  గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. ఇక రాజును  కలవడానికి  ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు... రాజా...ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన...

Telugu story

 బాటసారుల అదృష్టం అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి! “నేను ఎంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది!” అని గిరి రాముతో అన్నాడు. “నేను అదృష్టవంతుడిని అనకు, మనం అదృష్టవంతులము” అని రాము బదులు చెప్పాడు. “అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాదే, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!” అని గిరి కోపంగా అన్నాడు. రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు. ఇంతలో వెనక నుంచి “దొంగ! దొంగా!” అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు! “అరెరే! మన దెగ్గిర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!” అని గిరి ఖంగారు పడ్డాడు. “మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా” అని కూల్ గా రాము జవాబు చెప్పాడు. మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్త...

Devi movie song lyrics

 హే నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరథమే నీ కులుకే కళల కనకాంబరమే నీ ఒడిలో ఒక్కక్షణమే నా మదిలో స్వర్ణయుగమే నీ వలపే వేయి జన్మల వరమే కలిసిరావే కలల తార వయసు మీటే ప్రియ సితార సుధలొలుకు సరిగమ పలికి పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదసీకి ఆమని ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బుల్లోని కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతిజల్లు పైటచాటు ముత్యాలమ్మ గోదారి తీరం లోని సంధ్యారాగం కుచ్చెళ్లమ్మ మనసారా కోరుకున్న ఓసారైన వచ్చెళ్లమ్మ నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి నవ్వే రువ్వి నా జట్టే కావాలి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ కులుకే కళల కనకంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే హే.. మాఘమాసం వచ్చినాది నాయుడో బంతిమొగ్గ విచ్చినాది అద్దకాల పైట వచ్చి జారుతూ పెద్ద సిగ్గు తెచ్చినాది కోరచూపు గుండెల్లోకి దూసుకెళ్లి కోలోకోలో కోలాటాలు వేసినాది కొంటెపిల్లడో మీసకట్టు మీద ఒట్టు ఆశ పెట్టుకున్న దాన్ని చెయ్యిపట్టి ఏడకైనా తీసుకెళ్లరో నీలి నీలి ముంగురులు గాలిలోన గింగిరులు అందగత్తెలందరికీ నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కుకు కుకు కోయిలమ్మ ఒక్కొక్క అక్షరాన్నే పట్టీ పట్టీ పాడిందమ్మా జాబిల్లి చ...

Telugu story

 సంసిద్ధత ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటిని పదును చేసుకుంటోంది. ఈ విషయం ఒక నక్క గమనించింది. ఆ నక్కకు కొంచం వెటకారం ఎక్కువ. పక్క వాళ్ళను సూటి పోటి మాటలు అనకుండా ఉండలేదు. అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దాము అనుకుంది. పక్కన నుంచుని ఇటూ అటూ చాలా ఆత్రుతతో ఏదో బద్ధ శత్రువులు దాక్కున్నట్టు, వారిని చూసి భయ పడుతున్నట్టు నటించింది. అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది. మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క, “ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు? నాకేమి ఎవరు నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే?” అని చిరునవ్వుతో అడిగింది. అడవి పంది చాలా కూల్ గా, “ఎవరో దాడి చేసాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు. అయినా శత్రువులు ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతొ గొడవ పెట్టుకోరు” అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది. నిజమే. మనలోని బలహీనతే మన శత్రువులకు బలము. వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు. యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ.

Farmer idea changes his life

 🤔అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి..🤔 లాక్ డౌన్ వేళ ఓ రైతుఅద్భుతమే సృష్టించాడు.  కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు. డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు... ఎండు ద్రాక్ష.. ఎండిన అప్రికాట్​.. ఎండబెట్టిన_అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు. కష్టం నుంచి ఆలోచన! బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన K.గంగాధర్​ ఓ_సాధారణ_రైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్​. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​. కానీ, మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు. విదేశాల్లో ఎండు అరట...

Ashwini devathalu

*అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు. వీరు కవలలు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట.* *ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.* *వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది.* *ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతో అత్యంత ఉత్సాహంతో ఉంటాయి.* *చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారథి కూర్చోవడానికి త్రిఫలకాలు, త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి.*  *ఆరథంలో ఒకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి.* *అశ్వినీ దేవతల కంఠధ్వని... శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు.*  *వీరి చేతిలో తేనె, సోమరసం, మంచుతో అద్దిన బెత్తంతో...

Vivekanandha story

 గురుకులానికి సెలవలు వచ్చాయి. ‘‘వారం రోజులు అంతా ఇళ్లకు వెళ్లి రండి’’ అన్నారు గురువు. ‘‘వచ్చేటప్పుడు తలా రెండు గుప్పెళ్ల బియ్యం మూట కట్టుకు రండి’’ అని కూడా చెప్పారు. శిష్యులు తలలు ఊపారు.‘‘అయితే చిన్న షరతు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మీరు ఆ బియ్యాన్ని తీసుకురావాలి’’ అన్నారు గురువు. వారం గడిచింది. శిష్యులందరూ తిరిగి గురుకులానికి చేరుకున్నారు. అందరూ బియ్యం తీసుకొచ్చారు. వారిలో ఒక్కరు మాత్రం వట్టి చేతులతో వచ్చారు! ‘‘నువ్వు తేలేకపోయావేం?’’ అని ఆ శిష్యుడిని అడిగారు గురువు. ‘‘ఎవరూ చూడకుండా తేలేకపోయాను గురువర్యా’’ అన్నాడు శిష్యుడు. గురువు భృకుటి ముడివేశారు. ‘‘ఎవరి కంట్లోనూ పడకుండా బియ్యం డబ్బా దగ్గరికి వెళ్లేవాడిని. అయితే వెళ్లిన ప్రతిసారీ ఒకరు నన్ను చూసేవారు’’ అని చెప్పాడు శిష్యుడు. ‘‘ఎవరు ఆ ఒక్కరు’’.. అడిగారు గురువు. ‘‘నేనే గురువర్యా.. నా కంట్లో నేనే పడేవాడిని. అందుకే ఎవరూ చూడకుండా బియ్యం తేవడం సాధ్యం కాలేదు’’ అని చెప్పాడు ఆ శిష్యుడు. ఆ మాటకు గురువు.. మిగతా శిష్యుల వైపు చూశారు. ఎవరూ చూడకుండా తప్పు చేసినా, మన నుంచి మనం తప్పించుకోలేం అని చెప్పడానికే గురువుగారు బియ్యం దొంగిలించుకు రమ్మన్నారని...

Kaasi ki velithe kaayo pando vadhileyali

 కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... అందులో మర్మమేమిటి ?? అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు.. శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని. ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది. అంతే కానీ...  కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది. కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్త...

Telugu story

 ఒక ఊళ్లో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకొనేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని పిల్లవాడు ఇల్లిల్లూ తిరిగి, ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మి వచ్చిన డబ్బుతో చదువుకొనేవాడు. ఒకరోజున అలా అమ్మకానికి వెళ్ళినప్పుడు అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉన్నది. నీరసంగా ఉంది. ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ఒక్క రూపాయి మాత్రమే ఉంది. ఏంచేయాలి?... అక్కడున్న ఇంటి తలుపుతట్టి, కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం' అనుకుని వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు. అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు "ఒక గ్లాసుమంచినీళ్ళు ఇస్తారా?" అని మాత్రం అడగగల్గాడు. అయితే పిల్లవాడి ముఖం‌ చూస్తే, 'వాడికి ఆకలిగా ఉంది' అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు వాడికి ఒక పెద్ద గ్లాసెడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచి వచ్చి నట్లైంది. సంతోషంగా గ్లాసెడు పాలూ త్రాగేశాడు.  త్రాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది' తన దగ్గర ఉన్నది ఒక్క రూపాయే!' అని పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా జే...